దేవుడాలా గ్రామంలో ఇటీవల మరణించిన చిన్నారి కుటుంబానికి ఆర్ధిక చేయూతనందించిన జనసేన నాయకులు

ఇటీవలే మరణించిన చిన్నారి పద్మశ్రీ కుటుంబాన్ని దేవుడాలా గ్రామం, రేగిడి మండలంలో రాజాం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ ముచ్చ శ్రీనివాసరావు పరామర్శించి, జనసేన పార్టీ తరుపున 20,000₹ ఆర్ధిక సాయాన్ని ఆ కుటుంబానికి అందజేసి, ధైర్యంగా ఉండాలని తెలపటం జరిగింది. ఈ నేపథ్యంలో పుర్లి-దేవుడాల గ్రామస్తులు షుగర్ ఫ్యాక్టరీ యొక్క సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లటం జరిగింది. షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని జనసేన పార్టీ తరుపున హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ నాయకులు గర్భాన సత్తిబాబు, రెడ్డి బాలకృష్ణ, కంచరం జనార్దన్, శ్యామ్ సుందర్, రాంబాబు, హేమంత్, ఈశ్వర్, కె.ప్రభాకర్ రావు, కె.ధనుంజయ్, ఫాక్టరీ బాధితులు, రైతులు, జనసైనికులు పాల్గొనటం జరిగింది.