పరుచూరి భాస్కరరావుకి కృతఙ్ఞతలు తెలిపిన పెదిశెట్టి దుర్గ మరియు సుంకర మహేష్

అనకాపల్లి నియోజకవర్గం, ఇటీవల జనసేన పార్టీ విశాఖ రూరల్ జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులుగా అనకాపల్లి నియోజకవర్గం నుండి నియమింపబడిన జనసైనికులు అనకాపల్లి టౌన్ కి సంబంధించిన పెదిశెట్టి దుర్గ మరియు కశింకోట మండలం నుండి సుంకర మహేష్ లు నియమించిన సందర్బంగా శనివారం అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ అనంతరం రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావుని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా సభ్యులు ఇద్దరినీ భాస్కరరావు అభినందించారు. కష్టపడి పనిచేసే జనసైనికులకి ఎప్పటికీ పార్టీలో సముచిత స్థానం ఉంటుంది అని పరుచూరి భాస్కరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో కశింకోట మండల, అనకాపల్లి మండల, టౌన్ జనసైనికులు పాల్గొన్నారు.