కడియపులంక జనసేన ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు సంక్రాంతి కానుక

కడియం మండలం, కడియపులంక గ్రామంలో ఉన్న 30మంది పారిశుద్ధ్య కార్మికులకు సంక్రాంతి కానుకగా జనసేన ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో కొత్త బట్టలు మరియు 1000రూ నగదు సంక్రాంతి కానుకగా అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మార్గాని అమ్మాణి, వైస్ ప్రెసిడెంట్ రాంజీ, వార్డు మెంబర్లు బోడపాటి రాజేశ్వరి, నాగమణి, సెక్రటరీ శిరీష మరియు సచివాలయ సిబ్బంది పాల్గొనటం జరిగింది.