కొప్పిశెట్టి నీరయ్య కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం గోర్స గ్రామానికి చెందినటువంటి కొప్పిశెట్టి నీరయ్య అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పరామర్శించి వారి యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం ఒక నెలకు సరిపడా 50 కేజీలు బియ్యం మరియు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పెదిరెడ్ల దొరబాబు, ఉలవలు శ్రీనివాస్, ఉలవలు కొండబాబు, పెదిరెడ్ల సత్యనారాయణ, పెదిరెడ్ల నాగేశ్వరరావు, కాపుశెటి చిన్న, కర్నిడి హరీష్, శీలం వీరబూబు, వాసంశెటి ఆదినారాయణ, కొప్పిశెటి గణేష్, కంద చక్రధర్ రావు, పల్నాటి మధు, మరియు జన సైనికులు పాల్గొనడం జరిగింది.