పళ్ళ సత్తిబాబు కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ చేబ్రోలు గ్రామం నందు పళ్ళ సత్తిబాబు అకాల మరణానికి చింతిస్తూ వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అనంతరం వారి యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం 50 కేజీల బియ్యం మరియు ఆర్థిక సహాయం ఆ కుటుంభానికి అందించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా పెద్దింటి శివ, ఎలుగుబంటి దొరబాబు, చేదులూరి త్రిమూర్తులు, కర్నీడి వీరబాబు, సకినాల రాజు, కర్రి చిన్న మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.