పిడుగురాళ్ల మున్సిపల్ అధికారికి జనసేన వినతిపత్రం

గురజాల: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు పాటుపడిన బలహీన వర్గాల ఆరాధ్యులు మహాత్మ జ్యోతిరావు పూలే, వంగవీటి మోహనరంగా ఇరువురిని స్మరించుకుంటూ వారి యొక్క విగ్రహాలను పిడుగురాళ్ల పట్టణంలోని మెయిన్ రోడ్డు డివైడర్ మధ్యలో మన్యం పుల్లారెడ్డి హైస్కూల్ సెంటర్లో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని, తన చివరి శ్వాస వరకు బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజల సమస్యల కొరకు పాటుపడిన వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని ఆంధ్ర బ్యాంక్ సెంటర్లో ఏర్పాటు చేసుకోవడానికి స్థలాన్ని కేటాయించాలని, పిడుగురాళ్ల పట్నంలోని రోడ్డు విస్తరణ పనులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా కోరుతూ పిడుగురాళ్ల జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు పిడుగురాళ్ల మున్సిపల్ అధికారికి వినతిపత్రం అందించారు. ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రెటరీ దూదేకుల ఖాసీం సైదా, పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు దూదేకుల సలీం, మండల ఉపాధ్యక్షులు పెదకొలమి కిరణ్, బయ్యవరపు రమేష్, మండల ప్రధాన కార్యదర్శి చీదెళ్ల రామకృష్ణ, శ్రీను, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.