షేక్ నదీర్ ను సన్మానించిన జనసేన నాయకులు

తురిమెళ్ల గ్రామానికి చెందిన షేక్ నదీర్ నేపాల్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఛాంపియన్ షిప్ గేమ్స్ & హీరోస్ 2022 & ఎడ్యుకేషన్ అండ్ ఫెడరేషన్ లో 100 మరియు1600 మీటర్స్ పరుగు పందెంలో రెండవ స్థానం లో గెలవడం జరిగినది. ఈ సంద్భంగా గిద్దలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో షేక్ నదీర్ ని సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లంకా నరసింహా రావు, జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాల రంగయ్య, కంభం మండల అధ్యక్షుడు తాడిశెట్టి ప్రసాద్, కంభం మండల నాయకులు సందు నారాయణ, షేక్ శుభాని తదితరులు పాల్గొన్నారు.