భాదితునికి అండగా జనసేన నాయకులు

పెందుర్తి నియోజకవర్గం, 94 వార్డ్, పురుషోత్తపురం గ్రామంలో బొబ్బిలి శంకర్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు అని గ్రామ పెద్దలు జనసేన పార్టీ నాయకులు శ్రీ ఉరిటి లక్కీ గోవింద్ దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో వెంటనే స్పందించి జనసేన పార్టీ నాయకులు శ్రీ ఉరిటి లక్కీ గోవింద్, వీర మహిళ ఉరిటి లీలా దేవి 10000/- రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ నాయకులు బలగ వైకుంఠరావు, 94 వార్డ్ జనసైనికులు ఏర్ని రాజు, శేఖర్, కళ్యాణ్, సింహాచలం, సూరిబాబు, గోపాల్, చందు, నవీన్, తరుణ్, శ్రావణ్, చక్రి, కరెంట్ గోపాల్, డి.ఈశ్వరరావు, బంగరిరాజు, శ్రీను, కృష్ణ, ఈ.ఈశ్వరరావు జనసైనికులు వీరమహిళలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.