అమలాపురం వారాహి యాత్రను విజయవంతం చేయాలని బండారు పిలుపు

కొత్తపేట: వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర రోజు రోజుకీ విశేష స్పందన చేరుకుతుందని కొత్తపేట నియోజక వర్గ జనసేన ఇంచార్జీ బండారు శ్రీనివాస్ అన్నారు. తన యాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ప్రజాప్రతినిధులపై ఆయన తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చనివ్వనని చెపుతున్నారు. వైసీపీని ఓడించడానికి ఎన్ని వ్యూహాలైనా అమలు చేస్తామని అంటున్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేరిట శ్రీభక్తంజనేయ స్వామి దేవాలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించిన కొత్తపేట నియోజక వర్గ జనసేన ఇంచార్జీ బండారు శ్రీనివాస్ జూన్ 22న రావులపాలెం శ్రీ కృష్ణదేవరాయలు కాపు కళ్యాణ మండపం నుండి అమలాపురం గడియార స్తంభం వరకు భారీ ఎత్తున జరిగే ర్యాలీలో పాల్గొనాలని, యువత క్రమశిక్షణతో వ్యవహరిస్తూ, శాంతియుత వాతావరణంలో, యెవరికి ఏ ఇబ్బందులూ కలుగకుండా చేపట్టాలనీ పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరూ సమయం పాటించి, సరిగ్గా 4 గంటలకు ఇక్కడి నుండి బయలుదేరాలని, వచ్చిన ప్రతి ఒక్కరికీ వాతవరణం దృష్టిలో ఉంచకొని మజ్జిగ ప్యాకెట్లు, మంచినీరు ఏర్పాటు చేసాం అని, కొత్తపేట నియోజకవర్గంలో నాలుగు మండలాల జనసైనికులు అందరూ కళ్యాణ మండపం వద్దకు రావాలని సూచించారు. అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోయే “వారాహి యాత్ర”కు ఎటువంటి అడ్డంకులు లేకుండా సజావుగా, దిగ్విజయంగా ముందుకు సాగాలనే మహా సంకల్పంతో వారాహి యాత్ర ప్రతీ ఒక్కరూ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించాలని సూచించారు.