కొయ్యలగూడెం తహసీల్దారును మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

పోలవరం, కొయ్యలగూడెం మండల తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన కే.రాజ్యలక్ష్మిని శనివారం పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు, మండల అధ్యక్షులు తోట, టౌన్ అధ్యక్షులు మాదేపల్లి శ్రీనివాస్ గారు, ప్రధాన కార్యదర్శి ఏపూరి సతీష్, మండల కార్యదర్శి గొలిశెట్టి శ్రీనివాస్, టౌన్ ఉపాధ్యక్షులు చెప్పుల మధు బాబు తహసీల్దార్ కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేసారు. మండలంలో ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించారు.