మర్రిగూడ గ్రామంలో జనంలోకి జనసేన

పాలకొండ నియోజకవర్గం, సీతంపేట మండలం, మర్రిగూడ గ్రామంలో పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కూరంగి నాగేశ్వరరావు (ఎస్.బి.ఐ రిటైర్డ్ మేనేజర్) పర్యటించడం జరిగింది. ఈ పర్యటన కార్యక్రమంలో భాగంగా ప్రజలు వాళ్ల సమస్యలు చెబుతూ, స్థానిక ఎమ్మెల్యే మా గ్రామాన్ని 9 సంవత్సరాలుగా రాలేదని, ఒక్క ఇల్లు కూడా ఇచ్చేదాకలాలు లేవని, ఎన్నికల సమయానికి వచ్చి ఓట్లు ఎలా అడుగుతారని, నీటి సౌకర్యం కూడా మాకు లేవని వాపోయారు. మా గ్రామానికి వచ్చే హక్కు ఎమ్మెల్యే కి లేదని మహిళలు రైతులు చెప్పుకుచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి, జగన్ ప్రభుత్వం గ్రామస్థాయిలో సమస్యలను గాలికి వదిలేశారు. గ్రామస్థాయి అభివృద్ధిలో వైసీపీ పూర్తిగా విఫలమైందని, త్వరలోనే వైఎస్ఆర్సిపికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని, నాగేశ్వరరావు అన్నారు. నేను కూడా ఏజెన్సీ సమస్యలను స్వయంగా చూసిన వాడినని, జనసేన-తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది అని కూరంగి నాగేశ్వరరావు తెలియజేశారు.