మరణించిన జనసైనికునికి అండగా జనసేన నాయకులు

ఆచంట, గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో స్వర్గస్తులైన జనసైనికుడు ఏడిద దిలీప్ కుటుంబానికి అండగా నిలబడాలనే ఉద్దేశ్యంతో, ఆచంట నియోజకవర్గ ఇంచార్జ్ చేగొండి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో, నియోజకవర్గ జనసైనికుల సహయంతో ఒక లక్ష రూపాయలు సేకరించడం జరిగింది. ఈ లక్ష రూపాయలను, స్వర్గీయ ఏడిద దిలీప్ కుమార్తె అయిన చిరంజీవి ఏడిద ప్రణతి పేరు మీద సుకన్య సంవృద్ధి యోజన పథకం క్రింద బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. ఆ డిపాజిట్ పత్రాన్ని స్వర్గీయ ఏడిద దిలీప్ భార్య అయిన శ్రీమతి ఏడిద భారతికి, నియోజకవర్గ ఇంచార్జ్ చేగొండి సూర్యప్రకాష్ చేతులు మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెనుగొండ మండల అధ్యక్షులు కంబాల బాబులు, జిల్లా ఉపాధ్యక్షులు వెంగళదాసు దానయ్య, పెనుగొండ పట్టణ అధ్యక్షులు యర్రంశెట్టి బాబురావు, వడలి గ్రామ అధ్యక్షులు బొర్రా నాగేంద్ర, కొండవీటి శ్రీనివాసరావు, తోట సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.