తడ రజినికి నివాళులర్పించిన జనసేన నాయకులు

సత్యవేడు నియోజకవర్గం, వరదయ్య పాలెం మండలం బతలవల్లం పంచాయతీ చేదులపకం గ్రామానికి చెందిన జనసేన నాయకుడు తడ రజిని మరణించడం జరిగింది. జనసేన పార్టీ సత్యవేడు నియోజకవర్గం వరదయ్య పాలెం మండల అధ్యక్షులు చిరంజీవి యాదవ్ తడ రజిని భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించి తన కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకుడు కుల శేఖర్ రెడ్డి, మండల జనసేన పార్టీ ఉప అధ్యక్షులు, టి.ఎస్ శీరిష, దేవళ్ళ తులసిరామ్, ప్రధాన కార్యదర్శి యంపళ్ళ వెంకటేష్ , సంయుక్త కార్యదర్శులు పృధ్వీ, ప్రసాద్, కార్యకర్తలు అనిల్, సుభాష్, సతీష్, ఈశ్వర్, నవీన్, వినోద్, గోపి, పచ్చయ్య, చలయ్య, రామూర్తి, బ్రహ్మయ్య పాల్గొన్నారు.