మందకృష్ణ మాదిగకి వినతిపత్రం అందించిన జనసేన నాయకులు

మదిర, ముదిగొండ మండల జనసేన అధ్యక్షులు జొన్నలగడ్డ కుటుంబరావుతో పాటు బోనకల్ మండల జనసేన అధ్యక్షులు తాళ్లూరు డేవిడ్ మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలో అన్ని మండలాలకు దళిత బంధును అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మిగిలిన నాలుగు మండలాలకు బోనకల్ మధిర ఎరుపాలెం ముదిగొండ మండలాల్లో అన్ని గ్రామాల్లో దళిత బందు అమలుపరిచేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దళితులకు న్యాయం చేసే విధంగా తమరును జనసేన పార్టీ మధిర నియోజకవర్గం నుంచి కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.