పేద రైతు కుటుంబానికి జనసేన నాయకులు ఆర్ధిక సహాయం

శింగనమల, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పల మండలానికి చెందిన ఒక సాధార పేదరైతు గాజుల గంగప్ప వారం రోజుల క్రితం హఠాత్తుగా మరణించడం జరిగింది. కటిక పేదరికంతో మగ్గుతున్న కుటుంబాన్ని జనసేన నాయకులూ తుపాకుల భాస్కర్ ఆధ్వర్యంలో పరామర్శించి 5 వేల రూపాయల ఆర్ధిక సహాయం గంగప్ప కుటుంబ సభ్యులకు అందించి వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ, నియోజకవర్గ నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్, కిరీటి కుమార్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.