కందుల దుర్గేష్ కు జనసేన నాయకుల పరామర్శ

రాజమండ్రి: జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ సతీమణి అనారోగ్యం కారణంగా జనవరి 13 మరణించడం జరిగింది. కావున శుక్రవారం జనసేన పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు, చిలకం మధుసూదన్ రెడ్డి, అక్కాల గాంధీ, శిఖా బాలు దుర్గేష్ నివాసంలో కలిసి వారిని పరామర్శించడం జరిగింది.