మార్కాపురం జనసేన పార్టీ పాదయాత్రకు సిద్ధం

ప్రకాశం జిల్లా, జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ కార్యాలయం నందు శుక్రవారం జరిగిన అత్యవసర సమావేశంలో జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ మాట్లాడుతూ ఈనెల జనవరి 28వ తేది నుండి వెలిగొండ ప్రాజెక్టు మరియు ప్రత్యేక జిల్లా కోసం జనసేన పార్టీ తరుపున తాము పాదయాత్ర చేస్తున్నట్టు, ఈ పాదయాత్రకు మరో రెండు రోజుల్లో కమిటీ సభ్యులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం వెలుగొండ ప్రాజెక్ట్ ప్రాంతాన్ని సందర్శించి పాదయాత్ర చేయుటకు రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొందిలి కాశీరామ్ సింగ్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఎన్.వి.సురేష్, జిల్లా కార్యదర్శి శిరిగిరి శ్రీను, మార్కాపురం పట్టణ అధ్యక్షులు డాక్టర్ ఇమామ్ సాహెబ్, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, తర్లుపాడు మండల అధ్యక్షులు చేతుల శ్రీనివాసులు, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు వీరిశెట్టి శ్రీనివాసులు, జిల్లా లీగల్ సెల్ జాయింట్ సెక్రెటరీ శైలజ, పూజ లక్ష్మి, జనసేన నాయకులు విజయరావు. నరసింహ, పిన్నెబోయిన శ్రీనివాసులు, తిరుపతయ్య, దుగ్గిరామిరెడ్డి, షరీఫ్ , సతీష్, బొందిలి అనిల్, బొందిలి మణికంఠ, బొందిలి చరణ్, యోగేశ్వరారావు, బెల్లంకొండ రామకృష్ణ, ఖాజావలి, ఫణి, పిచ్చయ్య, గుండెబొమ్ము శ్రీనివాసులు, యాదగిరి శివ, శివ కాశీనారాయణ, రసూల్, జి.వి.నారాయణ, ఆవుల వెంకట్, నాగార్జున, రమాకాంత్ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.