గుత్తి పట్టణంలో జగనన్న కాలనీలను సందర్శించిన జనసేన నేతలు

గుంతకల్లు నియోజకవర్గం: గుత్తి పట్టణ సమీపన ఉన్న జగనన్న కాలనీని జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ అదేశాల మేరకు సందర్శించిన జనసేన నాయకులు మాట్లాడుతూ జగనన్న కాలనీలు “పేరు గొప్ప ఊరు దిబ్బ” అనే విదముగా ఉంది చిన్నపాటి వర్షానికే జలమయం అయ్యాయి అన్నారు. త్వరలో ప్రజలు తగిన బుద్ది వైసీపీకి చెప్తారు అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న వెంకటేష్, పాటిల్ సురేష్, బోయగడ్డ బ్రహ్మయ్య, నాగయ్య, ఓబులేష్, హేమంత్, సందీప్, సురేష్ కుమార్ పాల్గొన్నారు.