లక్కులు గ్రామాన్ని సందర్శించిన జనసేన నాయకులు

పాడేరు: జి.మాడుగుల మండలం, పాలమామిడి పంచాయితీ లక్కులు గ్రామస్తుల పిలుపు మేరకు ఆ గ్రామాన్ని సందర్శించిన జనసేన పార్టీ నాయకులు కొక్కిరపల్లి మెయిన్ రోడ్ నుంచి బొడ్డగొంది వెళ్లే రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది గతంలో తారు రోడ్ వేసినప్పటికి గుత్తేదారు నిర్లక్ష్యం, కక్కుర్తితో నాణ్యత లోపించడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు ప్రస్తుతం చూస్తే తారు రోడ్ వేసి సవత్సరం గడిచిన తర్వాత పూర్తి మెటల్ బయటకొచ్చి నూతనంగా వేస్తున్న రోడ్డులా కనిపించడం స్థానికులకు ఇంత నాణ్యత లోపం విస్మయం కలిగిస్తోంది. ఈ ప్రాంతం గుండా రోడ్లు పనులకు హెవీ వెహికల్స్ నిత్యం రద్దీగా కారణంగా కూడా రోడ్డు ఇంతలా ధ్వంశం కావడం జరిగిందని చెప్పవచ్చు ఏది ఏమైనా గుత్తేదారు నాణ్యత లోపంతో రోడ్డు వేయడమే ప్రధాన కారణమని సంబంధిత అధికారులు ఈ విషయమై చర్యలు తీసుకోవాలని ఇంకోసారి రోడ్డు మెరుగు పరచాలని జనసేన పార్టీ తరుపున కిల్లో రాజన్ డిమాండ్ చేశారు. ఈ గ్రామ సందర్శనలో జి.మాడుగుల మండల బూత్ కన్వీనర్ కొఱభానుప్రసాద్, కార్యనిర్వహన కమిటీ సభ్యులు తాంగుల రమేష్, చింతపల్లి మండల బూత్ కన్వీనర్ ఉల్లి సీతారామ్, వనబరంగి సాయి, ఎం సింహాచలం, శ్రీను, ఎస్ పడాల్, వంశీ పాల్గొన్నారు.