గాయపడిన అన్ను సత్యంను పరామర్శించిన జనసేన నాయకులు

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, డౌన్ స్ట్రీట్ లో అన్ను సత్యం పని చేస్తూ పడిపోవడం వల్ల కాలుకి ప్యాక్చర్ అయింది. ఈ విషయం వీరఘట్టం మండలం జనసేన టీమ్ దృష్టికి దూసి ప్రణీత్ తీసుకువచ్చారు. జనసేన బృందం సత్యం ను పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంనీ ఉదేశిస్తూ.. జనసేన జానీ మాట్లాడుతూ మిమ్మల్ని పరామర్శించడానికి మాత్రమే వచ్చాం అంటూ మూడు రకాలు పళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే జనసేన సిద్ధంతాలు మరియు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం సామాన్యులనీ ఆదుకోవాలి అంటే ఒక్క జనసేన ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పడం జరిగింది. మచ్చ పుండరికం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి అధికారం లేకపోయినా ఆంధ్రప్రదేశ్ సమస్యలు వినడానికి జనవాహిని కార్యక్రమం పెట్టారు. ఆలాగే కౌలు రైతులు లక్ష రూపాయిలు చొప్పున 3000 మందికి 30 కోట్లు ఇచ్చినటువంటి మంచి మనిషి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *