అగ్నిప్రమాద బాధితులకు సహాయం అందించిన జనసేన నాయకులు

పోలవరం నియోజకవర్గం: వేలేరుపాడు మండలం, ఎర్రబోరు గ్రామంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధం అయ్యింది. విషయం తెలుసుకున్న జనసేన మండల అధ్యక్షులు ఆది నారాయణ ఆధ్వర్యంలో పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి చిర్రి బాలరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి గల కారణాన్ని అడిగి తెలుసుకుని, బాదిత కుటుంబానికి భరోసా కల్పించారు. ప్రభుత్వ అధికారులు వచ్చి విషయాలు తెలుసుకుని వెళ్లారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, నగదు, దుస్తులు, ధాన్యం, సామాగ్రి కాలి బూడిద అయ్యాయని వారి భాదను వ్యక్తం చేసారు. ఇంచార్జి చిర్రి బాలరాజు, ఆది నారాయణ, సంజయ్, సత్యనారాయణ, బుచ్చిరాజు, జనసైనికులు వారి కుటుంబానికి తమవంతు సహాయంగా 3రైస్ బాగ్స్, వంట సామాగ్రీ, కూరగాయలు నిత్యావసర సరుకులు, దుప్పట్లు, బట్టలు, నగదు ఆర్ధికసహాయం అందించి మీకు మేమున్నామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసింహ, వంశీ, నవీన్, కిరణ్, కళ్యాణ్, మనోహర్, దేవిరెడ్డి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.