జనం కోసం జనసేన 565వ రోజులో భాగంగా గాజు గ్లాసుల పంపిణీ

జగ్గంపేట: జనం కోసం జనసేన 565వ రోజులో భాగంగా మన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 700 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 96460 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. సోమవారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు, గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి తమటం నాగేంద్ర, గండేపల్లి మండల సంయుక్త కార్యదర్శి అంకం సూరిబాబు, ఉప్పలపాడు నుండి గ్రామ అధ్యక్షులు తిరణాల శ్రీమన్నారాయణ, అంకం ఓమ్ కృష్ణ, కాటమళ్ళ నాగేంద్ర, అంకం సుబ్రహ్మణ్యం, కోరుకొండ రాంపండు, కొప్పిరెడ్డీ గణేష్, దూది శివ, దొడ్డ నాగబాబు, కోలా అప్పారావు, నాయకంపల్లి నుండి గ్రామ అధ్యక్షులు అల్లాడి వీరబాబు, బొడా అశోక్, గోనేడ నుండి నల్లంసెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు మరియు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా మల్లేపల్లి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన వెలిది చిన్న కుటుంబ సభ్యులకు, రామకుర్తి నరసింహ కుటుంబ సభ్యులకు, బలిరెడ్డి గణేష్ కుటుంబ సభ్యులకు, యరమళ్ళ రాజు కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.