లోకేష్ ని కలిసిన జనసేన నాయకులు

రాజమహేంద్రవరం, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రామచంద్రపురం జనసేన పార్టీ ఇంచార్ పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు రాజోలు జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు సంఘీభావం తెలియజేయడం జరిగింది. చంద్రబాబు అరెస్టు చాలా దారుణమని ఆయన రాజమండ్రిలో నారా లోకేష్ ని కలిసి మనోధైర్యాన్ని, మద్దతుని తెలియజేశారు. ఈ సందర్భంగా రాజోలు జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు మాట్లాడుతూ అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం చాలా దారుణమని, చంద్రబాబు రాష్ట్రానికి ఎన్నో అభివృద్ధి ఆర్యక్రమాలు చేసారని, అలాంటి నాయకుడిని దారుణంగా అరెస్ట్ చేయటం ముమ్మాటికీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నానని ఆయన అన్నారు.