జనసేనాని నిర్ణయం చరిత్రాత్మకం: ఆనంద్ చెట్టి

అరకు నియోజకవర్గం: పెదబయలులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంపై అరకు నియోజకవర్గ నాయకుడు చెట్టి ఆనంద్ స్పందిస్తూ మా అధినేత పవన్ కల్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం కాబోతున్నది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్ కి దిశానిర్దేశంగా కూడా కొనసాగుతారనడంలో ఎటువంటి సందేహంలేదు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు ముగింపు పలకడానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమనేది రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. ఈ విషయాన్ని జనసేనపార్టీ శ్రేణులు, అభిమానులు, జనసైనికులు, కార్యకర్తలు గమనించాలని కోరుతున్నాం. అదేసమయంలో పవన్ కళ్యాణ్ గారి మాట మనకు వేదం, అదే మార్గదర్శనం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి గౌరవించి ప్రతి జనసైనికుడు, అభిమాని, వీరమహిళలు అందరూ కూడా తూచా తప్పకుండా పాటించి మార్పు కొసం బలమైనటువంటి మద్దతు ఇవ్వడం, భాగస్వామ్యం కావడమనేది ప్రతీ ఒక్కరి బాధ్యతగా తెలియజేస్తున్నాం. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్ని కూడా జనసేనపార్టీ కి అనుకూలంగా ఉందనేది మనమంతా గుర్తించాలి. అనేక సర్వేలు, మేధోవర్గం, రాజకీయ విశ్లేషకులు ఈ రోజు జనసేన సిద్ధాంతాలకు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానానికి బలంగా సమర్దిస్తున్న విషయాన్ని మనం మరిచిపోకూడదు. కాబట్టి జనసేనపార్టీ అభిమానులుగా, కార్యకర్తలుగా ఉన్నా మనమందరు రాబోయే మార్పు కోసం, ఆంద్రప్రదేశ్ భవిష్యత్ కోసం పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసేటటువంటి లక్ష్యంతో రెట్టింపు ఉత్సాహంతో బలంగా పనిచేయాలని అందుకు ఎల్లవేల అండగా ఉంటామని తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుచుదాం రాష్ట్ర భవిష్యత్ కి తోడ్పాటునిద్దాం అని ఆనంద్ చెట్టి పిలుపునిచ్చారు.