యలమర్తి సోమబ్రహ్మంకి ఘన నివాళులు అర్పించిన జనసేన నాయకులు

రాజోలు: ఇటీవల స్వర్గస్తులైన జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మావయ్య గారు యలమర్తి సోమబ్రహ్మంకి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమేష్ బాబు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గుండాబత్తుల తాతాజీ, జిల్లా జాయింట్ సెక్రటరీ గుబ్బల రవికిరణ్, జనసేన నాయకులు పినిశెట్టి బుజ్జి, గొల్లమందల పూర్ణభాస్కరరావు, పోతు కాశీ, ఉండపల్లి అంజి తదితరులు పాల్గొన్నారు.