జనసేన మండల మహిళా కమిటీ నియామకం

తాడేపల్లిగూడెం నియోజకవర్గం: తాడేపల్లిగూడెం జనసేన ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు అడపా ప్రసాద్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం రూరల్ మండల మహిళా కమిటీ ఎన్నిక జరిగినది. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ మహిళా కన్వీనర్ గా మధులత కసిరెడ్డి, రూరల్ అధ్యక్షురాలుగా గరగ విష్ణు ప్రియ, పట్టణ మహిళా అధ్యక్షురాలుగా వెజ్జు రత్నకుమారి, పెంటపాడు మండల అధ్యక్షురాలుగా పెనుబోతుల సోమలమ్మను ఏకగ్రీవంగా బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నిక చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.