పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

గ్రేటర్ విశాఖపట్నం, 85వ వార్డు, మంత్రి పాలెం గ్రామంలో పెందుర్తి జనసేన నాయకురాలు శ్రీమతి గొన్న రమాదేవి మరియు 85వ వార్డు జనసేన నాయకులు దాసరి త్రినాథ్ 2 పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారు. వివరాలలోనికి వెళితే యాక్సిడెంట్ కారణంగా చేయి విరిగిపోవడం వలన గత రెండు నెలలుగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న బలిరెడ్డి సంతోష్ కుమార్ కుటుంబానికి మరియు కిడ్నీ మరియు హృదయ సంబంధిత వ్యాధి వలన గత మూడు నెలలుగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న షేక్ నాగూర్ కుటుంబానికి పెందుర్తి జనసేన నాయకురాలు గొన్న రమాదేవి, పదివేల రూపాయలు మరియు 85వ వార్డు జనసేన నాయకులు దాసరి త్రినాథ్ 5000 రూపాయలు మరియు మంత్రి పాలెం జనసైనికులు పచ్చికోరు శ్రీనివాసరావు యూఎస్ఏ పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కరణం పెంటారావు, అట్ట అప్పారావు, గొన్న హర్ష, చంద్రపాటి దుర్గారావు, దాసరి శ్రీను డాన్, గొల్లవిల్లి శ్రీనివాసరావు, మడక నూకరాజు, సేనాపతి మణికాంత్, సేనాపతి మహేష్, సేనాపతి శ్రీను, మడక బాబ్జి, అల్లుమల్ల రాము, గొలగాని కుమార్, గెంజి శ్రీను, మడక వీర, మంత్రి పాలెం జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.