మానవత్వం చాటుకున్న జనసేన నాయకులు

శృంగవరపుకోట నియోజకవర్గం: లక్కవరపుకోట మండలం, పోతంపేట కు చెందిన జనసైనికుడు సీర శ్రీను ప్రమాదంలో లెగ్ ఫ్రాక్చర్ అయింది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన శృంగవరపుకోట నియోజకవర్గ ఇంచార్జి వబ్బిన సత్యనారాయణ మానవతా దృక్పధంతో (రాజకీయాలకి అతీతంగా) సహృదయంతో ఆదివారం వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ఎల్. కోట మండల నాయుకులతో కలసి 15000/- రూ ఆర్థిక సహాయం మరియు భవిష్యత్తులో మీకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటాను అని భరోసా ఇచ్చారు. ఇలాంటి నాయుకులు మనకు ఇంచార్జిగా రావడం ఎంతో అనందంగా ఉందని పోతంపేట ప్రజలు, నాయుకులు వారి మాటలు ద్వారా వ్యక్త పరిచారు. మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల అధ్యక్షులు ఫిరోజ్ కి మరియు సూర్య, నాయుడు, రెహ్మాన్ వెంకటలక్ష్మి, కొత్తవలస మండలం నాయకులు పిల్లా రామదుర్గ, జిల్లా ప్రచార కమిటీ మెంబర్ మల్లువలస శ్రీను ఇతర కార్యవర్గానికి అభినందనలు తెలియజేసారు.