యువ ఓటర్లు నమోదుపై దృష్టి సారించండి: జనసేన నేతలు

బొబ్బిలి నియోజకవర్గం: రామభద్రపురం ఉన్నత పాఠశాలల్లో పోలింగ్ భూతుల వద్ద నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్లు నమోదు కార్యక్రమాన్ని ఆదివారం బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జి గిరడ అప్పలస్వామి మరియు మండల జనసేన నాయకులు మహంతి ధనుంజయ పరిశీలించారు. బిఎల్ఓల రిజిస్టర్లు, క్లెయిములు, దరఖాస్తులను తనిఖీ చేశారు. కార్యక్రమ నిర్వహణపై విఆర్ఓ అనిల్ తో మరియు బిఎల్ఓ నాయుడు, ప్రసాద్ లతో చర్చించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 18 ఏళ్ళు నిండిన యువతీయువకులందరిని ఓటర్లుగా చేర్పించాలని కోరారు. ఓటర్లు జాబితాలో మరణించిన ఓటర్లు, శాశ్వతంగా గ్రామం విడిచి వెళ్లిన ఓట్లను తొలగించాలని సిబ్బందికి సూచించారు. ఎక్కడా వాలంటీర్ల సహకారం తీసుకోవద్దని, ఎటువంటి తప్పులు లేకుండా ఖచ్చితమైన జాబితాను రూపొందించాలన్నారు.