కూరేటి అశోక్ కు అండగా నిలచిన జనసేన నాయకులు

రేపల్లె నియోజకవర్గం: చెరుకుపల్లి మండలం, ఆళ్ల వారి గ్రామంలో కొందరు ఆకతాయిలు జనసేన పార్టీ సానుభూతి పరుడు ఐనటువంటి కూరేటి అశోక్ రామదాసు వరి కుప్పలను తగలబెట్టడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ జనసేన పార్టీ నాయకులు గాజుల ఓంకార్, ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు చేతుల మీదగా ఆ రైతు కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్త మత్తీ భాస్కరరావు, రేపల్లె పట్టణ అధ్యక్షులు రామిశెట్టి మహేష్, బండారు సీతారామయ్య, ఆళ్ల భాస్కర్ నాయుడు, హనుమకొండ ప్రదీప్, గొల్లపూడి నాగరాజు, చవ్వాకుల పిచ్చయ్య, చవ్వాకుల రామకృష్ణ, సోమరావుతో తారక రామారావు, రంగిశెట్టి వెంకటేశ్వరరావు, చవ్వాకుల సుబ్బారావు పాల్గొన్నారు.