గొల్ల వీరభద్రంను పరామర్శించిన జనసేన నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలం, కమలాపురానికి చెందిన ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్ధి విభాగ కార్యనిర్వాహక సభ్యులు గొల్ల వీరభద్రం ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఖమ్మం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. జనసేన నాయకులు కార్యకర్తలు గొల్ల వీరభద్రంను పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగ సెక్రెటరీ గరికే రాంబాబు, జనసేన పార్టీ ములకలపల్లి మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్, జనసేన పార్టీ ములకలపల్లి మండల ఉపాధ్యక్షులు పొడిచేటి చెన్నారావు, జనసేన పార్టీ ములకలపల్లి మండల కార్యదర్శి బాధావత్ రవికుమార్, జనసేన పార్టీ కమలాపురం గ్రామకమిటీ నాయకులు మచ్చా శ్రీను బాడిశవేణు వాడే సురేష్ మచ్చా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.