మీసాల రమణయ్యను పరామర్శించిన జనసేన నాయకులు

ఎచ్చెర్ల, జి.సిగడాం మండలం నిద్దాం పంచాయతీ అద్దోనంపేట రోడ్డు విషయంలో అన్యాయంగా చేసిన పనికి గాను నిద్దాం జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థి మీసాల రవి మరియు జనసైనికులు వెళ్లి ప్రశ్నించగా వైసిపి దుండగులు వారిపై దాడి చేసిన దాడిలో మీసాల రవి మరియు మీసాల రమణయ్య తీవ్రంగా గాయపడ్డారు. అయితే మీసాల రమణయ్య శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలుసుకుని ఆమదాలవలస నియోజకవర్గం ఇన్చార్జి పేడా రామ్మోహన్ అలాగే ఎచ్చర్ల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు అర్జున్ భూపతి వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది.