వీరమహిళలకు, జనసైనికులకు జనసేన లీగల్ సెల్ అండగా ఉంటుంది: చదలవాడ రాజేష్

*జనసేన పార్టీ వీరమహిళలకు, జనసైనికులకు జనసేన లీగల్ సెల్ అండగా ఉంటుందని జనసేన పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు చదలవాడ రాజేష్ హామీ

గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం జనసేన పార్టీ లీగల్ సెల్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చదలవాడ రాజేష్ మాట్లాడుతూ.. త్వరలో నియోజకవర్గాల వారీగా లీగల్ సెల్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి కార్యచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు. తమ పార్టీ ఏర్పాటు చేసిన లీగల్ సెల్  ద్వారా జనసేన పార్టీ లోని ప్రతి ఒక్క సభ్యునికి న్యాయం జరిగేంత వరకూ పోరాటం చేస్తామని పేర్కొన్నారు. అనంతరం జనసేన పార్టీ లీగల్ సెల్
రాష్ట్ర కార్యదర్శి తీగల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలో లీగల్ సభ్యులు జనసేన పార్టీ నాయకులు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారికి న్యాయ సంబంధమైన సలహాలు సూచనలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు పనిచేస్తున్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు  లీగల్ సెల్ అండగా నిలుస్తూ న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సబ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గూడూరు జనసేన పార్టీ లీగల్ సెల్  కమిటీ సభ్యులు మోహన్, ప్రసాద్, సుమన్, దయా, రషీద్ , సునీల్, మణి కుమార్ తదితరులు పాల్గొన్నారు.