శ్రీకృష్ణపట్నం గ్రామంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర

  • శ్రీకృష్ణపట్నం గ్రామంలో రెపరెపలాడిన జనసేన జెండా
  • భారీగా తరలివచ్చిన జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణులు
  • పాదయాత్రలో బత్తుల కుటుంబానికి బ్రహ్మరధం పట్టిన ప్రజానీకం
  • శ్రీకృష్ణపట్నం గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీ.శే. నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

రాజానగరం మండలం, శ్రీకృష్ణపట్నం గ్రామంలో సోమవారం జనం కోసం జనసేన మహాపాదయాత్రలో భాగంగా జనసేన పార్టీ మహిళా సాధికార కమిటీ కో-ఆర్డినేటర్, నా సేన కోసం నా వంతు కమిటీ సభ్యురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, వారి కుమార్తెలు వీరమహిళా సాధికార కమిటీ కో ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల ప్రత్యూష దేవి, వందనాంబిక వినాయక స్వామి వారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అక్కడి నుండి పాదయాత్రగా గ్రామంలో పర్యటించారు. ప్రతీ ఇంటికీ తిరుగుతూ ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి బత్తుల బలరామకృష్ణ గారిని గెలిపించి నియోజకవర్గం అభివృద్ధికి బాటలు వేద్దాం అని తెలియజేస్తూ జనసేన పార్టీ కరపత్రం, కీ చైన్, బ్యాడ్జ్ అందజేసారు. అనంతరం శ్రీకృష్ణపట్నం గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జనసేన తెలుగుదేశం నాయకులతో కలిసి జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ బత్తుల బలరామకృష్ణ “జెండా ఆవిష్కరణ” చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనశ్రేణులు, వీరమహిళలు, జనసైనికులు భారీగా పాల్గొన్నారు.