రాప్తాడు వైసిపి సిద్ధం బహిరంగ సభ పూర్తిగా విఫలం

  • జగన్మోహన్ రెడ్డి గారు మీరు దేనికి సిద్ధం?
  • అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి

అనంతపురం: రాప్తాడు సిద్ధం వైసిపి బహిరంగ సభ పూర్తిగా విఫలమైందని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఎద్దేవా చేసారు. సోమవారం జయరాం రెడ్డి మీడియా ముఖంగా మాట్లాడుతూ ఈ సభ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లా రాయలసీమ ద్రోహి, అని రాయలసీమ రైతులకు స్పష్టంగా అర్థమైంది. ఎన్నికల ముందు పాదయాత్రలో రాయలసీమ రైతులకు హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్తించలేదు. రోజు ఎక్కడో ఒకచోట రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి కనీసం రైతాంగానికి నేనున్నాని భరోసా ఇచ్చిన పాపాన కూడా పోలేదు? సభా వేదిక పైన జగన్మోహన్ రెడ్డి గారు నేను 98% మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్తించాను అంటున్నారు? పచ్చి అబద్ధం కనీసం 30% కూడా హామీలు నెరవర్తించలేదు. రాయలసీమ 54 నియోజకవర్గాల నుంచి కాకుండా ఇతర నియోజకవర్గాలు నుండి బలవంతంగా వైసిపి కార్యకర్తలని ఆశా వర్కర్లని, ఉపాధి హామీ లబ్ధిదారులని, వాలంటరీలను, రాప్తాడు సిద్ధం బహిరంగ సభకు తరలించి భారీగా పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చినారు అని అబూత కల్పన కల్పించాలని చేసిన ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. ప్రజలు స్వచ్ఛందంగా తరలిరారని తెలిసి మందు, బీరు, బిర్యాని, డబ్బులు ఇచ్చి ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తూ సభను విజయవంతం చేయాలని చూసినప్పటికీ కనీసం, ప్రజలు 10% కూడా స్వచ్ఛందంగా తరలి రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు అధికారుల చేత ఒత్తిడి తెచ్చి వైసిపి సిద్ధం సభ కోసం తరలించడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు.
అభం శుభం తెలియని వైసిపి కార్యకర్తలని రెచ్చగొడుతూ.. ప్రతిపక్ష నాయకుల కటౌట్లు పెట్టి ఆ కటౌట్లు పైన దాడి చేయిస్తూ #పైశాచిక ఆనందం పొందుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కార్యకర్తల్ని ఉన్మాదులుగా తయారు చేస్తూ వచ్చే ఎన్నికల్లో ఏదో విధంగా దాడులు చేసైనా సరే గెలవాలని దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రవర్తన తీరుని ఖండిస్తున్నాం.