వంగలపూడిలో జనం కోసం జనసేన – మహాపాదయాత్ర

  • జనసేన పార్టీ యువజన నాయకులు తోట పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా కొనసాగిన మహాపాదయాత్ర
  • తోట పవన్ కుమార్ గారికి హారతులతో స్వాగతం పలికిన గ్రామ ప్రజలు
  • యానాదుల పేటలో పర్యటించి అక్కడి సమస్యలను ప్రజలతో మాట్లాడి తెలుసుకున్న తోట పవన్ కుమార్
  • ముందుగా గ్రామంలో ఉన్న స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ స్వామి వారి ఆశీస్సులు ఎల్లపుడూ ప్రజలపై ఉండాలని రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు

రాజానగరం: సీతానగరం మండలం, వంగలపూడి గ్రామంలో
జనం కోసం జనసేన” “మహాపాదయాత్రలో భగంగా శుక్రవారం జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో కలిసి పాదయాత్రగా గ్రామంలో ప్రతీ ఇంటికీ, ప్రతీ గడపకూ వెళుతూ ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జనసేన పార్టీ సిద్దాంతాలను వివరిస్తూ జనసేన పార్టీ కరపత్రం, కీ చైన్, పోకెట్ బ్యాడ్జ్, బొట్టు బిల్లల ప్యాకెట్ లను యువజన నాయకులు తోట పవన్ కుమార్ అందజేసారు. జనసేన కార్యకర్తలు, యువత, వీరమహిళలు తండోపతండాలుగా స్వచ్ఛందంగా ఈ మహాపాదయాత్రలో పాల్గొన్నారు.