హుకుంపేట మండల జనసేన పార్టీలో చేరికలు

అరకు నియోజకవర్గం: హుకుంపేట మండలంలో జనసేన పార్టీ అరకు నియోజకవర్గం ఇంచార్జ్ చెట్టి చిరంజీవి మరియు హుకుంపేట మండల జనసేన పార్టీ నాయకులు బలిజ కోటేశ్వరరావు పడాల్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ చేరికలు జరిగాయి. గతంలో కాంగ్రెస్ పార్టీలో మహిళా అధ్యక్షురాలిగా పనిచేసిన శ్రీమతి కొర్ర సరస్వతి మరియు శ్రీమతి తుడుము పద్మ జనసేన పార్టీ సిధ్ధాంతాలు, పవన్ కల్యాణ్ ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో చేరటం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గిరిజనులపై వాస్తవిక కోణంతో చూసి వారి అభివృధ్ధికోసం పాటు పడే వారు కేవలం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమేనని ఇకపై జనసేననితో కలిసి గిరిజన ప్రజలకు సేవచేయలనుకుంటున్నామని అన్నారు. ఈ చేరికలకు కృషి చేసిన అరకు జనసేనపార్టీ సమన్వయకర్త చెట్టి చిరంజీవి, హుకుంపేట మండాల నాయకులు బలిజవకోటేశ్వర్రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా కార్యనిర్వాహక సభ్యులు పరదాని సురేష్, బూడిద నాగరాజు, శోభ అర్జున్, వంతాల మోహన్, శోభ రాంబాబు దొర, సురకత్తి రాంబాబు, మజ్జి మహేష్, జన్ని లింగన్న, జన్ని సతీష్, శొనభ సునీల్ కుమార్, శొనభ జాని, సాయితేజ్, వెంకటేష్, నారాయణ మూర్తి, ప్రసాద్, నాగరాజు జన్ని కొండబాబు మరియు జనసైనికులు పాల్గొన్నారు.