దేవరపల్లిలో జనసేన మండల కమిటీ సమావేశం

గోపాలపురం నియోజకవర్గం: దేవరపల్లి మండలంలో జనసేన మండల అధ్యక్షులు కాట్నం గణేష్ ఆధ్వర్యంలో జనసేన మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నియోజవర్గ నాయకులు దొడ్డిగర్ల సువర్ణ రాజు, సీనియర్ నాయకులు అనిశెట్టి గంగరాజు, నాయుడు దుర్గాప్రసాద్, కాళ్ళ వెంకటరత్నం విచ్చేసారు. సమావేశంలో భాగంగా పార్టీ బలోపేతం గురించి, నియోజకవర్గంలో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారాన్ని, ప్రజల్లోకి పార్టీని ఎలా తీసుకుని వెళ్లాలని చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరమహిళలు సలాది వేణు మాధవి, కవల సీతారత్నం, మండల నాయకులు మరియు గ్రామ అధ్యక్షులు కంబాల సత్తిబాబు, సాంబ బాల శ్రీనివాస్, పాపోలు ప్రదీప్ కందుకూరి రామకృష్ణ, బాల మణికంఠ, నాయుడు, గరికిపాటి శ్రీనివాస్, చప్పటి శివనాగ ప్రసాద్, కాజా మొహిద్దిన్, జెకె, నామాల ప్రసాద్, వెంకటరత్నం పోసి, పాండు, నాయుడు పుట్ట కాశి, నూకల కరుణాకర్, ఆరేటి రత్నం, సోమిశెట్టి శ్రీను, అనిశెట్టి శ్రీనివాస్, ముమ్మడి బాలకృష్ణ, అనిశెట్టి మధు, మాలే సతీష్, పోలమాటి నాని, తదితర నాయకులు పాల్గొన్నారు.