జాలారి పల్లిపాలెం స్మశాన వాటికలో బోరు బాగుచేయించిన దల్లి గోవిందరెడ్డి

గాజువాక నియోజకవర్గం, 64 వార్డు గంగవరం, జాలారి పల్లిపాలెం గ్రామం, కొరుకు వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు ఏమనగా గత రెండు సంవత్సరాల నుండి జాలారి పల్లిపాలెం స్మశాన వాటికలో బోరు మూతపడిందని 64 వార్డ్ కార్పొరేటర్ శ్రీ దల్లి గోవింద్ రెడ్డికి సమస్యను తెలియజేశారు. సమస్య చెప్పిన 24 గంటల్లోనే, సమస్య పూర్తయింది. జాలారి పల్లిపాలెం గ్రామ పెద్దలు, కార్పొరేటర్ శ్రీ దల్లి గోవింద్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.. కార్పొరేటర్ గోవింద్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సమస్యను సాధనంగా నా వద్దకు తీసుకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు అలాగే నిత్యం జనసైనికులు మీకు అందుబాటులో ఉంటారని… మరోసారి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా మాజీ పార్లమెంట్ అధికారి శ్రీ సిహెచ్ ముసలయ్య, పి దేవుడు, కె వెంకటేష్, పి నూకరాజు, దాసు తదితరులు పాల్గొన్నారు.