వర్రా రవీంద్ర రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. పోలీసులకు జనసేన ఫిర్యాదు

తుని: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ఆదేశానుసారం గత నాలుగు రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో వైసిపి నాయకుడు వర్రా రవీంద్ర రెడ్డి అభ్యంతరకర పోస్ట్ లు పెట్టడాన్ని ఖండిస్తూ.. అతనిఫై చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని నియోజకవర్గంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో జనసేన పార్టీ తరపున ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.