మట్టపర్రు ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన జనసేన ఎంపీపీ శ్రీమతి మేడిచర్ల సత్యవాణి రాము

రాజోలు, పదవి అనేది అలంకారం కాదు బాధ్యత అని మలికిపురం మండల జనసేన తొలి మహిళా ఎంపీపీ శ్రీమతి మేడిచర్ల సత్యవాణి రాము అన్నారు. రాజోలు నియోజకవర్గంలో ఉన్న మట్టపర్రు ప్రభుత్వ పాఠశాలని సందర్శించి శానిటేషన్ పరిశుభ్రతను పరిశీలించారు, అనంతరం మధ్యాహన్నం భోజనంలో నాణ్యత గురించి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు, ఆడపిల్లలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి అని అన్నారు, విద్యాలయాలు దేవాలయంతో సమానం కావున విద్యాలయాల పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు, కరోనా తీవ్రత ఉంది కనుక పాటశాల సిబ్బందికి తగిన చర్యలు తీసుకోవాలని అలాగే విద్యార్దులకు ఆరోగ్యపరమైన అంశాలపై అవగాహన తరగతులు తీసుకోవాలి అని సూచించారు, సామాజిక దూరం పాటిస్తూ సానిటైజర్ ఉపయోగించాలి అని గుర్తుచేశారు, విద్యార్థులు ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు అయితే ఆందోళన చెందకుండా ఉపాధ్యాయుల దృష్టికి తెచ్చి వైరస్ పరీక్షలు చేయించుకొని తగిన జాగ్రత్తలు పాటించాలి అని విద్యార్థిని విద్యార్దులకు సూచించారు, ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.