అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించిన పిడుగురాళ్ల జనసేన

గురజాల: భారత రాజ్యాంగ రూపకర్త, అంటరానితనం కుల నిర్మూలన కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి, మొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి డాక్టర్ బాబాసాహెబ్ భీంరావ్ రాంజీ అంబేడ్కర్ 66వ వర్ధంతి సందర్భంగా పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ కార్యాలయం నందు, అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల కాశీం సైదా, జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు దూదేకుల సలీం, మండల ఉపాధ్యక్షులు బయ్యవరపు రమేష్, పెడ కొలిమి కిరణ్ కుమార్, నాయకులు బేతంచర్ల ప్రసాద్, కామిశెట్టి అశోక్, నాని, మొదలగువారు పాల్గొనడం జరిగింది.