చెరుకు రైతుల్లో చైతన్యం కోసం జనసేన పాదయాత్ర

విజయనగరం జిల్లా, సీతానగరం మండలంలో జనసేన ప్రచార కార్యదర్శి శ్రీ బాబు పాలూరు ఆధ్వర్యంలో ఎక్కువ చెరుకు రైతులు ఉన్న 6 గ్రామాల్లో జనసైనికులు అందరు పర్యటించి రైతులతో ముఖాముఖి చర్చించడం జరిగింది. జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీ బాబు పాలూరు రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంలో ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులును ఏ విధంగా మోసం చేస్తుందో ఆధారాలతో పాటుగా చూపిస్తూ వివరించడం జరిగింది. ఫ్యాక్టరీని మూసివేయడానికి ప్రభుత్వం మరియు ఫ్యాక్టరీ యాజమాన్యం మధ్య కుదిరిన చీకటి ఒప్పందాన్ని కూడా రైతులకు ఆదారాలతో పాటుగా చూపించడం జరిగింది. రైతుల్లో చైతన్యం కలిగించి ఈ శనివారం అన్ని గ్రామాల్లో గల రైతులతో పాటుగా జనసేన పాదయాత్ర చేయడానికి సిద్ధమైంది. ఈ పాదయాత్రలో రైతులు తమ పొలంలోని పిడికెడు మట్టిని ముడుపుగా కట్టుకొని తలపై పెట్టుకొని వాళ్ల గ్రామాల నుంచి లచ్చయ్యపేట సుగర్ ఫ్యాక్టరీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆ ముడుపుని చెల్లించుకుంటారు. ఈ పాదయాత్రలో రైతు యొక్క ఎద్దుల బండ్లు మరియు చెరకుగడలతో పాటుగా వ్యవసాయ పనిముట్లను కూడా పట్టుకుని వచ్చి రైతులు తమ నిరసనను భారీగా తెలియజేస్తారు. కావున విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జనసేన నాయకులు మరియు జనసైనికులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం పార్టీ బలోపేతానికి చాలా అవసరం ఈ విషయాన్ని గుర్తించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాము.