జనసేన పార్టీ అవనిగడ్డ గ్రామ కమిటీ సమావేశం

అవనిగడ్డ: అవనిగడ్డ జనసేన ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన జనసేన పార్టీ టౌన్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు రాజనాల వీరబాబు, ఉపాధ్యక్షులు ఆళ్ళమళ్ళ చందుబాబు, గుగులోతు కిరణ్ నాయక్, భోగాది రాజ్యలక్ష్మి మరియు టౌన్ ప్రధాన కార్య దర్శిలు అన్నపురెడ్డి ఏసుబాబు, షేక్ పరిద్ బాబా, అద్దంకి ధనుంజయ్ పార్టీ కార్యకర్తలు హాజరు కావడం జరిగింది. సమావేశంలో భాగంగా మొదటిగా గతవారం గ్రామ పంచాయతీలో ఇచ్చిన సమస్యల వినతి పత్రం గురించి తక్షణ కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది.