వందరోజుల పాటు శ్రీశైలం శైవక్షేత్ర శివ భక్తులకు జనసేన పార్టీ ఉచిత మజ్జిగ మరియు చలివేంద్రం: చింతా సురేష్ బాబు

కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పటేల్ సెంటర్ నందు జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు మానపాటి శ్రీనివాస్ వారి మిత్రబృందం శివరాత్రి పండుగ సమిపిస్తూన్న తరుణంలో శివభక్తులకు,పరిసర ప్రాంత ప్రజలకు దాహం తీర్చేందుకు జనసేన పార్టీ తరపున ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ మరియు చలివేంద్రం ఏర్పాటు చేశారు వారి ఆహ్వానం మేరకు కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ చింతా సురేష్ బాబు ముఖ్యఅతిథిగా హాజరై చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలం క్షేత్రానికి ఏటా లక్షలలో శివ భక్తులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మరియు కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రల నుండి ఉగాది పండుగ వరకు వస్తూనే ఉంటారు వారి కోసం జనసేన పార్టీ తరపున నందికొట్కూరులో ఉచిత మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఉచిత మజ్జిగ చలివేంద్రం వందరోజుల పాటు కొనసాగించాలి అని అనుకోవడం అభినందనీయం ఇలాగే సేవా కార్యక్రమాలు ప్రతి ఏటా చేస్తు జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని నియోజకవర్గ నాయకులకు జనసైనీకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, జనసేన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.