జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మెరకపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కీ.శే. గిడుగు గణేష్ జ్ఞాపకార్దం వారి కుమారుడు జనసేన నాయకులు గిడుగు రమేష్ ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా శనివారం గొంది పద్మరాజు కాలనీ మరియు సఖినేటిపల్లి స్టీమర్ రేవు ప్రాంత ప్రజలకు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని రాజోలు జనసేన నాయకులు మరియు జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ వ్యవస్థాపకులు నామన నాగభూషణం తెలిపారు.