జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ విస్తృతస్థాయి సమావేశం

జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అద్యక్షులు రాధారం రాజలింగం అద్యక్షతన హోటల్ అమంత్రన్ లో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. క్రియాశీల సభ్యులు అయిన సైదులు(చౌటుప్పల్) మరియు శ్రీనివాస్(హుజూర్ నగర్) ఇటీవల చనిపోవడం జరిగింది. వారు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకుని ఉండడంతో వారికి జనసేన పార్టీ నుండి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కులను త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం పై దిశానిర్దేశం చేయడానికి జనసేన శ్రేణులతో సోమవారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.