ప్రజలకు జనసేన పార్టీ అండగా ఉంటుంది: చప్పిడి శ్రీనివాసులు రెడ్డి

కోవూరు నియోజకవర్గం, కోవూరు మండలం పంచాయతీ పరిధిలోని ఎన్.ఎస్.ఆర్ కాలనీలో మంచి నీటి సమస్యపై పోరాటం చేసిన జనసేన కోవూరు నియోజకవర్గం ప్రజలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని కోవూరు నియోజకవర్గ పర్యవేక్షకులు చప్పిడి శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాల నుండి మంచినీటి సమస్య ఉందని అక్కడ స్థానికులు తెలిపారు. గత సంవత్సరం జరిగిన స్థానిక ఎన్నికల ప్రచార సమయంలో అక్కడ వైసిపి నాయకులు నీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని స్థానిక ప్రజలు తెలిపారు. ఎన్నికల ముగిసిన తర్వాత నుంచి మమ్మల్ని పట్టించుకోలేదని అన్నారు. కోవూరు మండలం అధ్యక్షుడు మాట్లాడుతూ ఈ సమస్యపై శనివారం 10 గంటలకు పంచాయతీ కార్యాలయంలో అర్జీ ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గం పర్యవేక్షకులు చప్పిడి శ్రీనివాసులు రెడ్డి, కోవూరు మండల అధ్యక్షుడు షేక్ అల్తాఫ్, కోవూరు నియోజకవర్గం ఐటి విభాగం కోఆర్డినేటర్ నల్లబల్లి సాయి కృష్ణ, మండలం ఉపాధ్యక్షులు వెంకటేష్,మహేష్ మండలం ప్రధాన కార్యదర్శులు పవన్ కుమార్, మండలం కార్యదర్శులు హర్ష, విజయ్, మండలం సంయుక్త కార్యదర్శులు తన్మయి, సతీష్ కుమార్, మురళి, రాజ్ కుమార్ మరియు కోవూరు మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.