మంగళగిరిలో రాబోయే ఎన్నికలకు సిద్ధమైన జనసేన పార్టీ

మంగళగిరి నియోజకవర్గ జనసేన కార్యాలయంలో నియోజకవర్గస్థాయిలో మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన ఎంటిఎంసీ కమిటీ, మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండల కమిటీ సభ్యులందరితో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో భాగంగా రాబోయే ఎన్నికల నాటికి మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ క్యాడర్ మరింత పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, గ్రామ మరియు బూత్ కమిటీలు తొందరగా ఏర్పాటు చేసుకుని ప్రజలకు మరింత చేరు అవ్వాలని ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు చిల్లపల్లి శ్రీనివాసరావు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో గ్రామ మరియు బూత్ కమిటీలు ఏర్పాటు, నియోజవర్గ స్థాయిలో పార్టీనీ ఏ విధంగా బలపరచాలి, మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ చేయబోయే మరియు జరగబోయే కార్యక్రమాలపై చర్చ, కార్యకర్తలకు శిక్షణ తరగతులు ఏర్పాటుపై చర్చ, సోషల్ మీడియా సభ్యులకి అవగాహన తరగతులు, గ్రామాల్లో ఉన్న సమస్యలపై ముఖ్యంగా చర్చించారు. ఈ సమావేశానికి ఎంటిఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు(ఎస్.ఎన్.ఆర్), దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, మంగళగిరి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు దాసరి శివ నాగేంద్రం, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు (జె.ఎస్.ఆర్), ఎంటిఎంసీ కమిటీ, మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండల కమిటీ సభ్యులు, మంగళగిరి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.