కె.ఎం.పురం నందు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం, కె ఎం పురం పంచాయతీ, కె.ఎం.పురం గ్రామం నందు నెలకొని ఉన్న సమస్యలపై యుగంధర్ పొన్న ఆధ్వర్యంలో సోమవారం మండల అభివృద్ధి అధికారి కార్యాలయం ముందు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతుంది. గ్రామం నందు నెలకొని ఉన్న సమస్యల వివరాలు క్రింది విధంగా ఉన్నవి.

శిథిలావస్థకు చేరుకున్న నీటి ట్యాంకు.. కొత్త నీటి ట్యాంకు నిర్మాణం చేపట్టాలి.
బ్రిటిష్ కాలం నాటి కట్టడాన్ని తలపిస్తున్న నీటి ట్యాంకు..దీనివల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు.
ఉన్న రెండు చేతి బోర్లు పనిచేయకపోవడం.
ప్రతి వీదికి నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి.
నీటి వసతి సరిగా లేనందున గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు.
పైన పేర్కొన్న సమస్యలకు సంబంధిత మండల అధికారులు వెంటనే స్పందించాలి అంటూ యుగంధర్ పొన్న డిమాండ్ చేశారు.